Tuesday, January 31, 2017
తులసి తినాల్సిందే!
• తులసి తినాల్సిందే!
జలుబు, దగ్గు లాంటివి బాధిస్తున్నప్పుడు మాత్రల్ని వాడతాం. ఈసారి అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రల కన్నా..
కొన్ని తులసి ఆకుల్ని నమిలి చూడండి. వాటివల్ల జలుబు, దగ్గు మాత్రమే కాదు.. మరికొన్ని సమస్యలూ అదుపులోకి వస్తాయి. అసలు తులసి ఎలాంటి అనారోగ్యాల్ని దూరం చేస్తుందంటే..
తులసి, తేనె కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల కొన్ని పోషకాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కాలంలో వచ్చే పలు ఇన్ఫెక్షన్లు దూరంగా ఉంటాయి. చిన్నారులకు తులసి అలవాటు చేయడం చాలా మంచిది.
* ఈ కాలంలో జలుబు, దగ్గు ఎక్కువగా బాధిస్తాయి. అలాంటప్పుడు తులసి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. రకరకాల వైరస్లూ దూరం అవుతాయి. ఇతర వ్యాధులు కూడా ఇబ్బంది పెట్టవు. జలుబు త్వరగా తగ్గుతుంది.
* దగ్గుతో బాధపడుతున్నవారు తులసి ఆకులను మెత్తగా చేసి.. అందులో తేనె, కొద్దిగా మిరియాలపొడి కలిపి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల రాత్రిళ్లు దగ్గు బాధించదు. తొందరగా అదుపులోకి వస్తుంది.
* అలర్జీలు ఉన్నవారు తేనె, తులసి తీసుకుంటే చాలా మంచిది. ఇందులో యాంటీసెప్టిక్ గుణాలు అధికం. చర్మ సంబంధిత అలర్జీలు తగ్గుతాయి.
* తులసి తినడం వల్ల వయసు పైబడుతున్న లక్షణాలు తగ్గుతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మం యౌవనంగా ఉండటానికి తోడ్పడతాయి.
* తులసిని తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. మూత్రంలో వ్యర్థాలను తొలగించే గుణం తులసిలో ఉంది. అలానే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెకు రక్తప్రసరణ సక్రమంగా అవుతుంది. హృద్రోగాలూ దూరం అవుతాయి.
దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.
దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.
దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమ పావన నివాసం. అలాంటి దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము.
1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి.
2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు.ఇలా ధరించినవారిని ఆలయ ప్రవెశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి తండ్రులు ప్రొత్సహించరాదు .
3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో వెల్లరాదు. గీతలో పరమాత్ముడు ” పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి” …ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను” అన్నాడు.
4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.
6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి.
7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.
8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి.తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.
9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలొ ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని ” అకాల మృత్యు హరణం …” అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీస్కోవాలి.
10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.
11) ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో తీస్కోవాలి.
12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.
13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.
14) అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు
15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.
16) జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.
17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.
18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.
19) ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.
20) నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.
21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.
22) ఒక చేత్తో దర్శనం చేయకూడదు.
23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.
24) ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.
25) ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.
26) బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.
27) ఆలయ ఆస్తులను అపహరించకూడదు.
28) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.
29) ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.
30) మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.
31) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.
32) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.
33) గోపుర దర్శనం తప్పక చేయాలి.
34) ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.
35) ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.
36) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.
*రాముడి వంశ వృక్షo*
*రాముడి వంశ వృక్షo*
*ఈ వంశ పరంపర విన్నా చదివినా , పుణ్యం*
*బ్రహ్మ కొడుకు మరీచి*
*మరీచి కొడుకు కాశ్యపుడు.*
*కాశ్యపుడు కొడుకు సూర్యుడు.*
*సూర్యుడు కొడుకు మనువు.*
*మనువు కొడుకు ఇక్ష్వాకువు.*
*ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.*
*కుక్షి కొడుకు వికుక్షి.*
*వికుక్షి కొడుకు బాణుడు.*
*బాణుడు కొడుకు అనరణ్యుడు.*
*అనరణ్యుడు కొడుకు పృధువు.*
*పృధువు కొడుకు త్రిశంఖుడు.*
*త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు)*
*దుంధుమారుడు కొడుకు మాంధాత.*
*మాంధాత కొడుకు సుసంధి.*
*సుసంధి కొడుకు ధృవసంధి.*
*ధృవసంధి కొడుకు భరతుడు.*
*భరతుడు కొడుకు అశితుడు.*
*అశితుడు కొడుకు సగరుడు.*
*సగరుడు కొడుకు అసమంజసుడు.*
*అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.*
*అంశుమంతుడు కొడుకు దిలీపుడు.*
*దిలీపుడు కొడుకు భగీరధుడు.*
*భగీరధుడు కొడుకు కకుత్సుడు.*
*కకుత్సుడు కొడుకు రఘువు.*
*రఘువు కొడుకు ప్రవుర్ధుడు.*
*ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.*
*శంఖనుడు కొడుకు సుదర్శనుడు.*
*సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.*
*అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.*
*శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.*
*మరువు కొడుకు ప్రశిష్యకుడు.*
*ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.*
*అంబరీశుడు కొడుకు నహుషుడు.*
*నహుషుడు కొడుకు యయాతి.*
*యయాతి కొడుకు నాభాగుడు.*
*నాభాగుడు కొడుకు అజుడు.*
*అజుడు కొడుకు ధశరథుడు.*
*ధశరథుడు కొడుకు రాముడు.*
*రాముడి కొడుకులు లవ కుశలు . .*
*ఇది రాముడి వంశ వృక్షo ...*
***************👏👏👏
Monday, January 30, 2017
వసంత పంచమి విశిష్టత ఏమిటి?
వసంత పంచమి విశిష్టత ఏమిటి?
మాఘ మాసం (జనవరి-ఫిబ్రవరి) శుక్ల పక్షం లో ఐదవరోజును (పంచమి తిథి) వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని జరుపుకుంటారు. ఈ రోజు జ్ఞానానికి, సంగీతానికి, కళలకు దేవత అయిన సరస్వతీ దేవిని పూజిస్తారు. అయితే వీణాధరిని పూజించే మరొక పర్వ దినమైన "సరస్వతీ పూజ" దసరాలలో వస్తుంది. ముఖ్యంగా వసంత పంచమి నాడు ఎక్కువగా పిల్లలకు "అక్షరాభ్యాసం" జరుపుతారు. హిందూ సంస్కారాలలో అక్షరాభ్యాసం ఒకటి. నామకరణం (బారసాల), అన్నప్రాసన, ముండనం (పుట్టు జుట్టు ఇవ్వడం), అక్షరాభ్యాసం (విద్యారంభం), ఉపనయనం, వివాహం మొదలయినవి అన్నీ సంస్కారాలే.
అక్షరాభ్యాసం (అక్షర అభ్యాసం) అంటే అక్షరాలను సాధన చేయడం. దీన్ని ఈ దినం తొలిసారిగా దిద్దటం తో ప్రారంభిస్తారు. సాధారణంగా పిల్లలకు అయిదు సంవత్సరాల ప్రాయం లో అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరం అంటే క్షరము లేదా క్షీణత లేనిది లేదా నశింప లేనిది; "అభ్యాసం" అంటే సాధన. ఇంకో విశేషం ఏమిటంటే "అక్షర" లో "అ" మొదలుకుని "క్ష"-"ఱ" తో ముగిసేవి కనుక "అక్షఱ"ములు అని చెప్పుకోవచ్చును.
అక్షరాభ్యాసం చేసేటప్పుడు "ఓం నమః శివాయ సిద్ధం నమః" అని ముందుగా ఒక పళ్ళెంలో బియ్యం పోసి వేలితో వ్రాయించి తరువాత కొత్త పలక పై వ్రాయిస్తారు. అయితే పరిణామ క్రమం లో పలక-పుల్ల నుంచి పుస్తకం-పెన్సిల్/పెన్ను తదుపరి కంప్యూటర్ - మౌస్ కు మారాయనుకోండి.
అయితే అక్షరాభ్యాస సమయంలో సరస్వతీ దేవిని ఇలా స్తుతిస్తారు.
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ భవతు మే సదా!
వాగ్దేవి సరస్వతి ని తలచుకొంటే 'బాసర' జ్ఞాన సరస్వతి ఆలయం చెప్పుకోదగినది. ఈ ఆలయం తెలంగాణా లో నిర్మల్ జిల్లాలో పావన గోదావరీ తీరాన వుంది. కురుక్షేత్ర యుద్దానతరం శాంతి కోసం వేదవ్యాసుడు తన శిష్యులతో తపస్సు చేసుకోవడానికి ఒక ప్రశాంతమైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ, దండకారణ్యం దర్శించి, ఆ స్థలం చాల అనుకూలంగా ఉంటుందని తలచి, సమీపంలోని గోదావరి నదినుండి దోసిళ్ళతో ప్రతి రోజూ ఇసుకను తెచ్చి మూడు రాశులుగా పోయగా అవి పసుపు పూసిన సరస్వతి, లక్ష్మి మరియు కాళీ మూర్తులుగా, ముగ్గురమ్మలు గా మారాయట. ఈ పసుపును(బండారు) కొద్దిగా తింటే విజ్ఞానము, వివేకము పెంపొందుతాయని భక్తుల నమ్మకం. వ్యాసుని చే సృష్టించ బడిన ఈ ప్రదేశం "వ్యాసపురి,"గా"వాసర" గా, తదుత్తర కాలంలో "బాసర" గా వాసి కెక్కిందని స్థల పురాణం. ఆ విధంగా వసంత పంచమి నాడు ఎక్కడ చూసినా పసుపు రంగు దర్శనమిస్తుంది. అమ్మవారికి పసుపు చీరలు పెడతారు. పసుపు రంగుల మిఠాయిలు నైవేద్యం పెడతారు. ఎందఱో తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం కోసం బాసరకు వస్తారు. అంతే కాదు చాల మంది యుక్తవయస్కులు సరియైన ఉపాధి లేక, జీవితంలో స్థిరపడని వారు బాసర క్షేత్రం దర్శించి ఇక్కడి పావన గోదావరిలో మూడు మునకలేసి దీక్షగా భిక్ష చేసిన వారికి అనువైన బ్రతుకుతెరువు లభిస్తుందని పలువురి నమ్మకం. అందుకే భాషను పెంపొందించి, బ్రతుకు బాట చూపి బాసట గా నిలిచేది బాసర.
*🕌తెలంగాణాలో దర్శనీయ ప్రదేశాలు🕍*
*🕌తెలంగాణాలో దర్శనీయ ప్రదేశాలు🕍*
🕉🕉 *కొమ్మాల*
వరంగల్కు 40 కి.మీ. దూరంలో ఉంది. ఈ కొమ్మాల తీర్థం పాండవులు తపస్సు చేసిన ప్రాంతం. ఈ గ్రామంలోని ఒక గుట్టుకు పాండవుల గుట్ట అని పేరు. దీనిపై కోనేరు ఉంది.
🔷🔷 *లక్నవరం చెరువు*
ములుగు నుంచి ఏటూరు నాగారం వెళ్లే మార్గంలో వరంగల్కు 70 కి.మీ. దూరంలో ఈ చెరువు ఉంది.
🏄🏼🏄🏼 *రామప్ప చెరువు*
ఈ చెరువు పాలంపేట రామప్ప ఆలయం దగ్గర్లో ఉంది. కాకతీయ గణపతి దేవుని కాలంలో (1213లో) రేచర్ల రుద్రుడు నిర్మించాడు. కాకతీయ ప్రభువులు ఆలయం సమీపంలోనే చెరువు ఉండాలన్న సంప్రదాయాన్ని పాటించేవారు. అందుకే రామప్ప చెరువును తవ్వించారు. ఈ చెరువు ప్రాంతంలో ప్రకృతి సౌందర్యం ఉట్టిపడుతుంది.
🕌🕌 *ఘనపురం ఆలయాలు*:
పాలంపేటకు 8 కి.మీ. దూరంలో కాకతీయుల కాలానికి చెందిన 22 దేవాలయాలు ఉన్నా యి. ప్రధాన ఆలయం శైవాలయం. రామప్ప దేవాలయం నిర్మాణం జరిగిన కొంతకాలానికి ఈ ఆలయాన్ని నిర్మించారు. గ్రామం చివర రెడ్డి గుడి అనే దేవాలయం ఉంది.
🏓🏓 *ఘనపురం తటాకం*
ములుగు తాలూకాలో ఉంది. ఇక్కడ అనపోతుని శాసనం కలదు. ఇక్కడ ఎండాకాలంలో చల్లని నీరు ప్రవహిస్తూ, వర్షాకాలంలో నీరు ప్రవహించదు.
⚪⚫ *కొమరవెల్లి*
జనగామకు 13 కి.మీ. దూరంలో వీరశైవ మతకేంద్రం ఉంది. ఇక్కడ మట్టితో చేసిన 4 అడుగుల విగ్రహం ఉంది. 4 చేతులలో త్రిశూలం, నాగాస్త్రం, ఒక పాత్ర ఉన్నాయి. ఇక్కడి ప్రధాన దైవ కొమరెల్లి మల్లన్న.
⭕ *పాకాల చెరువు*
ఈ చెరువు విహార సరస్సు. దీని నుంచి 5 పంట కాలువలు కలవు. వరంగల్కు 70 కి.మీ దూరంలో పచ్చటి చెట్లు పెరిగిన గుట్టల మధ్య ఈ చెరువు ఉంది. కాకతీయ గణపతి దేవుడు ఈ చెరువును తవ్వించినట్టు చెబుతారు. పాకాల చెరువు చుట్టూ 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాకాల వన్యమృగ అభయారణ్యం ఉంది. శీతాకాలంలో వలస వచ్చే పక్షులతో పాటు పెద్ద పులులు, చిరుతలు, జింకలు కూడా అందులో ఉన్నాయి. మున్నేరు వాగు ఈ సరస్సుకు ఆధారం.
🔘 *పెంబర్తి*
:కాకతీయులు తమ రథాలను, ఆలయాలను అలంకరించుకోవడానికి దళసరి రేకును విరివిగా ఉపయోగించేవారు. ఈ అలంకరణ అనేది ఒక కళ. కాకతీయ సామ్రాజ్యం క్షీణించిన తర్వాత ఈ కళ పతనమైంది. అయితే నిజాం నవాబుల కాలంలో ఈ కళను పునరుద్ధరించారు. వరంగల్కు 60 కి.మీ. దూరంలోని పెంబర్తి కళాభిమానులు తప్పక సందర్శించే ప్రాంతం.
💥 *ఏటూరి నాగారం*
వరంగల్కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో, గోదావరి తీరాన అభయారణ్యం ఉంది. అందులో తేళ్లు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు ఉన్నాయి. చుట్టూ చిన్నచిన్న గుట్టలతో, పచ్చని చిట్టడవులతో ఈ అభయారణ్యాన్ని చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది. ఏటూరి నాగారం సమీపంలోని తాడ్వాయ్లోనూ అటవీశాఖ కాటేజీలను నిర్వహిస్తుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అక్టోబర్-మే నెలల మధ్యకాలం అనువైనది.
☄☄☄ *తాటికొండ*
: ఘన్పూర్ రైల్వే స్టేషన్కు 7 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ రెండు కోటలు ఉన్నాయి. దీన్ని సర్దార్ సర్వాయి పాపన్న కట్టించాడని ప్రతీతి.
🌟🌟 *పాలకుర్తి*
ఈ గ్రామం ఘనపురం రైల్వే స్టేషన్ నుంచి 29 కి.మీ. దూరంలో ఉంది. పాలేరు............. వాగు ఇక్కడి నుంచే పుడుతుంది. అందుకే పాలకుర్తి అనే పేరు వచ్చింది. ఇక్కడ నరసింహ స్వామి ఆలయం ఉంది. దీనికి సోమనాథాలయం అనే పేరు వచ్చింది. వీరశైవ మతవాది అయిన కవి పాలకుర్తి సోమనాథుడు
🍀🍀🍀 * శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం - వేములవాడ:*
కరీంనగర్కు 35 కి.మీ. దూరంలో కలదు. ఇక్కడ ధర్మ కుండం అనే కోనేరు ఉంది. వేములవాడ చాళుక్యరాజు రాజాధిత్యుడు ఈ ఆలయ నిర్మాత. అర్జునుడి మనుమడు నరేంద్రుడు నిర్మించాడనేది స్థల పురాణం. ఈ ఆలయంలో 22 శివ లింగాలున్నాయి. అందులో రామాలయం, మహిషాసురమర్దని ఆలయం, కాశీ విశ్వనాథాలయం చూడదగినవి.
⚜ *కాళేశ్వరం*
: గోదావరి ఉపనది కాళేశ్వరం కలిసేచోట ఉంది. స్కాంద పురాణంలో దీని ప్రస్తావన కలదు. ఇక్కడి శిల్పాలపై బౌద్ద-జైన శిల్ప రీతుల ప్రభావం కనిపిస్తుంది. వేంగిరాజు విష్ణువర్ధనుడు ఈ ప్రాంతాన్ని జయించినట్లు ఆధారాలున్నాయి. ఆయన దండయాత్ర నాటికి నగరంలో 26 కోనేరులు ఉండేవట. కాకతీయ ప్రోలరాజు బంగారంతో తులాభారం తూగి, దాన్ని స్వామికి ఇచ్చాడని స్థానికుల అభిప్రాయం. ఇక్కడి ముక్తేశ్వరాలయంలో 2 శివలింగాలుండటం విశేషం. ముక్తేశ్వర స్వామి లింగంలో 2 రంధ్రాలుండటం మరో విశేషం. ఇక్కడ బ్రహ్మకు గుడికట్టారు. 1246 నాటి కాకతీయ గణపతి దేవుని శాసనం ఇక్కడుంది.
🕌🕌 *ధర్మపురి:*
కరీంనగర్కు 65 కి.మీ. దూరంలో ఉంది. దేశంలోని 108 పుణ్యక్షేత్రాల్లో ధర్మపురి ఒకటి. దీనికి దక్షిణ కాశీ అని పేరు.
🚩🚩 *రామగిరి దుర్గం:*
కరీంనగర్కు 40 కి.మీ. దూరంలో బేగంపేట గ్రామం వద్ద ఉన్న ఎత్తైన పర్వతాన్ని రామగిరి అంటారు.
తెలంగాణలోనే అతిపెద్ద శత్రుదుర్భేద్యమైన కోట ఇక్కడ ఉంది. ఇక్కడి సీతారామాలయం దగ్గర్లో పాండవ లంక ఉంది.
🕍🕍🕍 *నాగనూరు కోట:*
ఇది కాకతీయుల నిర్మాణం. కరీంనగర్కు 8 కి.మీ. దూరంలో ఉంది. కోటలో 3 ఆలయాలు ఉన్నాయి.
♣ *వరాహస్వామి ఆలయం*
కమాన్పూర్ మండల కేంద్రంలో ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రెండేరెండు వరాహస్వామి ఆలయాల్లో ఇది ఒకటి. బండపై చెక్కిన విగ్రహం వెంట్రుకలు కనిపించడం విశేషం. స్థల పురాణం ప్రకారం 600 సంవత్సరాల చరిత్ర ఉంది.
కరీంనగర్కు 60 కి.మీ. దూరంలో ఉంది.
✳ *కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం*
: 400ల ఏండ్ల క్రితం కొడిమ్యాల పర్గణాలో సింగం సంజీవుడనే యాదవ కులస్థుడు స్థాపించాడు. ఇక్కడి విగ్రహం రెండు ముఖాలతో (నారసింహస్వామి ముఖం, ఆంజనేయస్వామి ముఖం) ఉండటం విశేషం.
♨ *కొత్తకొండ కోర మీసాల స్వామి:*
భీమదేవరపల్లి మండలం, కొత్తకొండలో ఉంది. ఇది ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధమైన వీరభద్ర క్షేత్రం.
☢☢ *మత్స్యగిరీంద్రుడు:*
13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో మత్స్య గిరీంద్రుని ఆలయాన్ని నిర్మించారు. ఇది కరీంనగర్కు 30 కి.మీ. దూరంలో ఉంది.
🔶 *మంథని:*
మంథని అంటే వేద విద్యలకు పుట్టినిల్లు. ఇక్కడ లక్ష్మీనారాయణ, ఓంకారేశ్వర, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాలతోపాటు జైన, బౌద్ద మతాల ఆలయాలు ఉన్నాయి.
🔮 *బాసర:*
బాసరలో జ్ఞాన సరస్వతీ దేవాలయం ఉంది. బాసరను వ్యాసపురి అని కూడా అంటారు. ఇది గోదావరి తీరంలో ఉంది.
🛢 *బాసరకు పేరు*
- వ్యాసుడు తపస్సు చేసి సరస్వతీదేవిని ప్రతిష్టించినందుకు వ్యాసర అనే పేరు వచ్చింది. వ్యాసర క్రమంగా బాసర అయింది. బాసర ఆలయం దేశంలోనే రెండో అతిపెద్ద సరస్వతి దేవాలయం (మొదటిది జమ్ముకశ్మీర్లో ఉంది.).
🕌🕌🕌 *నాగోబా ఆలయం*
: ముట్నూరుకు దగ్గరలో కేస్లాపూర్ గ్రామంలో ఉంది. నాగోబా అంటే సర్ప దేవత. వేలమంది గిరిజనులు నాగుల చవితి సందర్భంలో ఇక్కడ మహా ఉత్సవం చేస్తారు.
🕍🏛 *అగస్త్యేశ్వరాలయం*
: గోదావరి తీరంలో అగస్త్యుడు తపస్సు చేసిన ప్రాంతం. చెన్నూరులో ఉన్న ఈ ఆలయాన్ని ఉత్తర వాహిని అంటారు. ఇది అతి ప్రాచీన ఆలయం. 1289లో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. అల్లాఉద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కపూర్ ఈ ఆలయంపై దాడిచేసి ధ్వంసం చేశాడు. శ్రీ కృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లుగా ఇక్కడి తెలుగు కన్నడ భాషా లిపిలో ఉన్న శాసనం చెబుతుంది. ఇక్కడ గోదావరి నది ఉత్తరంగా ప్రవహిస్తుంది. ఈ ఆలయంలోని అఖండ జ్యోతి 400 ఏండ్లుగా వెలుగుతూనే ఉందని స్థానికులు చెబుతారు.
☸ *జైనాద్ ఆలయం*
: ఆదిలాబాద్కు 21 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని పల్లవ రాజులు పాలించారు. ఇక్కడ శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయం జైన మందిరాన్ని పోలి ఉంది.
♦♦ *సిరిచెల్మ సోమేశ్వరాలయం:*
ఇచ్చోడకు 14 కి.మీ. దూరం లో ఉంది. 7వ శతాబ్దానికి చెందిన సోమేశ్వరాలయంలో శైవ, వైష్ణవ, జైన, బౌద్ధ మత శిల్ప సంపద కలదు. ఇక్కడ శ్రీ కృష్ణ దేవరాయలు భార్యతో కలిసి అర్చన చేసినట్లుగా శాసనాధారం.
🔷 *నిర్మల్:*
దీని చుట్టూ దుర్గం కలదు. పూర్వం వెలమ రాజుల పాలనలో ఉండేది. ఇక్కడ మహదేవ మందిరం ఉంది.
♻♻ *కన్విట్ తాలూకాలోని మహుర గొప్ప చారిత్రక స్థలం*
. ఇక్కడ ప్రాచీన రేణుకాదేవి మందిరం ఉంది. ఈమెను ఏకవీరాదేవి అంటారు.
🔴🔴🔴🔴🔴🔴🔴🔴
*ఇతర చూడదగిన ప్రాంతాలు:*
1. రామకృష్ణాపురంలోని గాంధర్వ కొండ, పోచమ్మ ఆలయం,
2. కుంటాలలోని సోమేశ్వరాలయం,
3. సిరిసిల్లలోని వేంకటేశ్వరాలయం,
4. బెల్లంపల్లిలోని బుగ్గరామేశ్వరాలయం, నిర్మల్లోని మహదేవాలయం.
💥💥 *ఏడు జలపాతాలు*:
బోధ్ నియోజకవర్గంలో 15 కి.మీ. పరిధిలో 7 జలపాతాలు కలవు. అవి:1. కుంటల 2. పొచ్చెర 3. లఖంపూర్ 4. గాజిలి 5. పొచ్చెల పాలధార 6. ఘన్పూర్ జలపాతం 7. కనకాయి జలపాతం........
💥💥 *జమలాపురం*
(తెలంగాణ తిరుపతి): ఇది ఎర్రుపాలెం (మం)లో ఉంది. వేంకటేశ్వరస్వామి దేవాలయం సూదిబోడపై కలదు. స్థల పురాణం ప్రకారం ఇక్కడి రెండు గుహలలో ఒకటైన వైకుంఠ గుహలో జాబాలి మహర్షి తన శిష్యులకు వేదం నేర్పాడని కథనం. మరొక గుహ పేరు కైలాస గుహ. ఈ దేవాలయాన్ని కాకతీయుల కాలంలో కట్టిఉండొచ్చని చరిత్రకారుల అభిప్రాయం.
💥💥 *శ్రీ బాలజీ*
వేంకటేశ్వరస్వామి: అన్నపురెడ్డిపల్లిలో ఉంది. ఇది ఖమ్మం జిల్లాలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. అన్నపు రెడ్డి అనే కాకతీయ సేనాపతి నిర్మించిన ఆలయాన్ని 1870లో వెంకటప్పయ్య పునర్నిర్మించాడు. మీర్ మహబూబ్ అలీఖాన్ అనే సుల్తాన్ పాలనా కాలంలో కాళ్లూరి వెంకటప్పయ్య మైసూరు ప్రాంతం నుంచి వలస వచ్చి దేవాలయాన్ని నిలబెట్టాడు.
✨💥 *నీలాద్రి ఆలయం:*
దీన్ని కాకతీయుల కాలంలో నిర్మించారు. ఇది 1996 -97 సంవత్సరాల మధ్య దట్టమైన అడవుల నుంచి బయటపడింది. ఇక్కడ శివరాత్రి ఉత్సవం బాగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న జెండా గుట్ట కాకతీయుల విజయాన్ని తెలుపుతుంది.
💥💥 *రామాలయం*
(వనం కృష్ణాలయం): ముదిగొండ (మం) వనం కృష్ణరాయలు కట్టించినందున ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది.
💥 *కూసుమంచి శివాలయం:*
ఇది కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆలయం చుట్టూ నిర్మించిన కళా ఖండాలు రమణీయమైనవి.
👏👏👏👏👏👏 👏👏
ఐశ్వర్య మంచి అందగత్తే . ఆమె భర్త హరీష్ కూడా అందగాడే . చూడ చక్కని జంట . ఆన్యోన్యమైన కాపురం . వాళ్ళను చూసి అందరూ ముచ్చట పడేలా ఉండేవారు .
.
.
అనుకోకుండా వాళ్ళ జీవితాలలో ఒక విషాదం జరిగింది
.
.
ఏమయిందో తెలీదు
.
ఐశ్వర్యకు చర్మం కాలినట్టు రంగు మారిపోతోంది . ఆమె అందమైన ముఖం కూడా చర్మవ్యాదివలన రూపం మారిపోవడం మొదలు పెట్టింది . ఆమె అందం అంతా ఏమయిపోతోందో ఆమెకే అర్ధం కావడం లేదు . డాక్టర్ లు ఏమీ చెప్పలేకపోయారు .
.
ఒక రోజు హరీష్ ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళాడు . రిటర్న్ లో వస్తూ ఉంటె ఆక్సిడెంట్ అయింది . అతడి రెండు కళ్ళూ పోయాయి .
.
ఐశ్వర్య దుఃఖానికి అంతే లేదు
.
అయితే ఒక అదృష్టం . వాళ్ళ కాపురం లో కలతలు లేకుండా ముందు లాగే సాగుతోంది . అతడికి కళ్ళు పోయాయని ఆమెకు చింత లేదు . ఆమె కురూపిగా మారినా హరీష్ కు తెలియలేదు .
.
ఆమె వ్యాధి ముదిరిపోతోంది . చర్మం అంతా కమిలిపోయి సాదా సీదా పనులు చెయ్యడానికి కూడా కష్టం అయిపోతోంది . గతాన్ని తలచుకొని ఆమె ఎంతో బాధ పడుతోంది . తన బాధను తనలోనే అణుచుకొని హరీష్ తో మునుపటిలాగే ఉంటోంది .
.
.
ఒక రోజు ఉదయానికి ఐశ్వర్య ఇంక లేవలేక పోయింది . ఆమె బాధను చూడలేని హరీష్ ఆమెకు జ్వరం వచ్చింది అనుకుని తోచినంతలో అనీ తానే చేశాడు . ఆమె ఆ సాయంత్రం మరి లేవలేదు .
.
.
హరీష్ ఆమె కర్మకాండలు అన్నీ చేశాడు . ఆమె లేని ఇంట్లో ఎలా గడపడం ?
.
.
ఒక్కడే !
.
.
.
ఒక రోజు సామాను అన్నీ సర్దుకుని వెళ్లిపోతుంటే పొరుగు ఉన్న పవన్ వచ్చి ఎలా బ్రతుకుతారు ? ఇక్కడ మీకు అందరూ తెలిసిన వారు కదా ! వేరే చోట మీకు ఇబ్బంది అవుతుందేమో ? ఆలోచించండి అన్నాడు .
.
.
.
‘నేను గుడ్డివాడిని కాను పవన్ ! నా భార్య బాధ పడకూడదు అని గుడ్డివాడిలా నటించాను . తన శరీరం రంగు మారడం నాకు తెలియనట్టు నటించాను . నాకు తెలిస్తే , నేను తనకు దూరం అయిపోతాను అని తను ఆత్మహత్య చేసుకుని ఉండేది పవన్ . తన శరీర బాధ కన్నా నేను ఏమన్నా అనుకుంటానేమో అనే బాధ ఆమెకు ఎక్కువ అయి ఉండేది . ఆమె నన్ను అంతగా ప్రేమించింది . ఆమెను సంతోషంగా ఉంచడం కోసం నేను నటించాను . ఆమె తృప్తిగా మరణించింది . అది చాలు నాకు “
.
.
.
.
ఏమనుకుందాం ?
.
.
నిజమైన సంతోషం ఎదుటివారిని సంతోష పెట్టడం లోనే ఉంది అని ఆచరణలో చూపిన హరీష్ వంటి వారు మనలో కూడా ఉండే ఉంటారు కదూ !
.
.
నచ్చితే ఒక మంచి మాట ,
.
వీలయితే పదిమందికీ పంచండి .
............🌹.............
*నిజమైన సంతోషం ఎదుటివారిని సంతోష పెట్టడం లోనే ఉంది*
👌
🙏
Let we all practice this😀