Saturday, April 30, 2016

నీ విలువ ఎంత --?

🌹నీ విలువ ఎంత --?🌹
=================

ఒక వ్యక్తి దేవునిని అడిగాడు ”నా జీవితం విలువ ఎంత” అని.
అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి “ ఈ రాయి విలువ తెలుసుకునిరా... కానీ దీనిని అమ్మకూడదు” అని చెప్పి పంపించారు.
ఆ వ్యేక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....
ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి నేను ఒక ఐదు పండ్లు ఇస్తాను, అమ్ముతావా ఏంటి అని అడిగాడు.

కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యేక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గరినుండి వెళ్ళిపోయాడు.
తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....
ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను ఒక పది కేజీల కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడిగాడు.

కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యేక్తి ఆ కూరగాయల వ్యాపారి దగ్గరి నుండి కూడా వెళ్ళిపోయాడు.
తరువాత.... ఆ వ్యేక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు.

ఆ బంగారు నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను ఒక 50 లక్షాలు ఇస్తాను, నాకు అమ్మవా అని అడిగాడు. ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు చెప్పారు కనుక ఆ వ్యేక్తి ఆ బంగారు నగల వ్యాపారి దగ్గరినుండి కూడా వెళ్లిపోతుంటే ఆ నగల వ్యాపారి “సరే 4 కోట్లు ఇస్తాను” అని అడిగాడు.... ఈ వ్యేక్తికి కొంచం ఆశ కలిగింది కానీ ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు ప్రత్యేకంగా చెప్పారు కనుక ఆ వ్యేక్తి అమ్మను అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు.

తరువాత.... ఆ వ్యేక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి “మీకు ఎక్కడిది అండి ఈ ఇంత విలువైన రాయి ? నేను నా ఆస్తిని, చివరికి నన్ను నేను అమ్ముకున్న మీ దగ్గరి నుండి ఈ సంపదను కొనటం నావల్ల కాదు అండి.... చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదు” అని చెప్పాడు.

ఆ మాటలు వినగానే ఈ వ్యేక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు.... వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు.... అప్పుడు దేవుడు.... నీ జీవితం విలువ ఏంత అని అడిగావు కదా.... ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారిదగ్గరికి, కూరగాయల వ్యాపారికి, బంగారు నగల వ్యాపారికి చూపినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు.... కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాలవ్యాపారి మాత్రం దీని అసలు విలువనుకూడా చెప్పలేక పోయాడు.... నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటివాడివే.... నీ జీవితం కూడా వెలకట్టలేనిది.... కానీ మనుషులు వారివారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెల కడతారు, నీ స్థాయిని బట్టి నిన్ను వెల కడతారు.... నువ్వు వారికీ ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెల కడతారు అంతే.
అది వారి స్థాయి.
కానీ నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు.... నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి.

Friday, April 29, 2016

అందరికి కనువిప్పు కలిగించే వాస్తవ కథ.........

అందరికి కనువిప్పు కలిగించే వాస్తవ కథ.........
ఓ కొడుకు.........కోడలు....వారి పుత్రుడు.......
..వారితో పాటు
నాన్నమ్మ
ఒకే ఇంట్లో ఉండేవారు.
ఆ కోడలికి అత్తగారిని ఎలాగైనా వేరుగా ఉంచాలి అన్న ఆలోచం
ఉండేది.ఎన్నో సార్లు భర్తను అడిగి చూసింది. కానీ ఆ కొడుకు దానికి
ఒప్పుకోలేదు..........రోజూ ఏదో వంకతో భర్తను సాధించసాగింది.
ఒకరోజు భర్తతో మంచిగా ఉంటూనే..........ఇలా అన్నది......
" మీ అమ్మ ను పక్కనే ఉన్న ఇంట్లో ఉంచి.....సమయానికి
ఆమెకు
వేడి వేడిగా వేళకు చేసి
పంపుతాను. ఆమెకూడా విశ్రాంతిగా ప్రశాంతంగా ఉంటుంది కదా! ఒక్కసారి
ఆలోచించండి "
ఏదో చికాకులో ఉండి " సరేలే చూద్దాం " అన్నాడు భర్త......ఇదే
అదనుగా
అత్తగారికి ఇంటికి పక్కనే
ఓ ఇంటిని చూసి పంపడానికి రెడీ చేసింది ఆ కోడలు......
ఆ తల్లి కూడా కొడుకు మాటను కాదు అనలేక.........తనవల్ల
ఇద్దరి
మధ్య గొడవ ఎందుకని ఆ తల్లి అంగీకరించింది..
కానీ కొడుకు కు
తెలియకుండా ఆ కోడలు ఆ అత్తగారికి ఓ షరతును పెట్టింది .
అదేంటంటే.........అత్తగారికి ఓ పళ్ళెం ఇచ్చి భోజనానికి టిఫినుకు

పళ్ళెం తీసుకుని అత్తగారు
రావాలి....
పాపం ఆ తల్లికి ఇది అవమానంగా అనిపించింది....
...అడుక్కుతినే
దానిలా
అలా వెళ్ళడం బాధగా
అనిపించినా కొడుకును ఇబ్బంది పెట్టలేక అలాగే చేసింది ఆ
అత్తగారు.
ఇది మనవడికి చాలా బాధగా అనిపించేది..........నాన్నమ్మ
అలా దూరంగా
ఉండటం ఆ
పసిమనసుకు నచ్చలేదు. అలా తిండికోసం నాన్నమ్మ రావడం
అస్సలే
నచ్చలేదు....
వాళ్ళ అమ్మకు తెలియకుండా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి
ఆడుకునేవాడు.......
అలా కొన్ని సంవత్సరాలు గడిచి పోయాయి....మనవడికి మంచి
ఉద్యోగం
వచ్చింది....మొదటి జీతం
రాగానే తన తల్లికి ఓ వెండి పళ్ళెం కొని తీసుకుని వొచ్చాడు.......
.తల్లి
ఆనందంతో ..........
" నామీద ఎంత ప్రేమరా! నీకు నాకోసం వెండి పళ్ళెం తెచ్చావా! నువ్వే
రా నా
కొడుకంటే" అంటూ కొడుకును మెచ్చుకుని మళ్ళీ ఇలా అంది.......
" ఇంట్లో ఎవరికీ వెండి పళ్ళెం లేదు మరి నాకే ఎందుకు తెచ్చావురా
కన్నా! "
అని అడిగింది.
దానికి ఆ కొడుకు ఇలా జవాబు ఇచ్చాడు....
" అమ్మా! రేపు నాకు పెళ్ళి అవుతుంది.. నువ్వుకూడా వేరేగా ఉండాల్సి
వస్తుంది కదా! అప్పుడు
నా పెళ్ళాం నీకు కనీసం స్టీలు పళ్ళెం కూడా ఇవ్వడానికి
ఒప్పుకోకపోవచ్చు
....అందుకే ఇప్పుడే
వెండి పళ్ళెం కొనేశాను..........రేపు నువ్వు ఏ ఆకులోనో అన్నం
తినడం నేను
చూడలేనమ్మా!"
కనీసం మా అమ్మ వెండి పళ్ళెంలో అడుక్కుంటుందన్న తృప్తి నాకు
ఉండాలి
కదమ్మా!"
కాబట్టీ............మనము ఇతరులకు చేసే మంచైనా, చెడైనా
మళ్ళీ
మనకే తిరిగి వస్తుంది....
తల్లిదండ్రులను భారంగా భావించి మీరు తప్పు చేస్తూ........మీ
పిల్లలకు
కూడా నేర్పకండి...
.

జీవిత ఉపయెాగాలు

జీవిత ఉపయెాగాలు

1. ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి
జ. గోరు వెచ్చనివి.

2.నీరు త్రాగేవిధానము
జ. క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.

3.ఆహరం ఎన్ని సార్లు నమలాలి
జ.32 సార్లు.

4. భోజనం నిండుగ ఎప్పుడు తినాలి
జ. ఉదయం.

5. ఉదయం ఎన్ని గంటలలోపు టిఫిన్ తినాలి
జ. సూర్యోదయం అయ్ న 2.30 గం" లోపు.

6.ఉదయం పూట టిఫిన్ తో ఏమి త్రాగాలి
జ. ఫల రసాలు(fruit juice).

7. మధ్యానము భోజనం తర్వాత ఏమిత్రాగాలి
జ. లస్సీ, మజ్జిగ.

8. రాత్రి భోజనం తో ఏమి త్రాగాలి
జ. పాలు.

9. పుల్లటి ఫలములు ఎప్పుటు తినకూడదు
జ. రాత్రి.

10. ఐస్ క్రీం ఎప్పుడు తినాలి
జ. ఎప్పుడూ తినకూడదు.

11.ఫ్రిజ్ లోంచి తీసిన పదార్దాలు ఎంత సేపటికి తినవలెను
జ. గంట తర్వాత.

12. శీతల పానియాలు త్రాగవచ్చున( cool drink )
జ. త్రాగకూడదు.

13. వండిన వంటలను ఎంత సేపటిలో తినాలి
జ. 40 ని.

14.రాత్రి పూట ఎంత తినాలి
జ.  చాలా తక్కువగా, అసలు తిననట్టు.

15. రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలి
జ. సూర్యాస్తమయం లోపు.

16. మంచినీళ్ళు భోజనానికి ఎంత ముందు త్రాగాలి
జ. 48 ని.

17. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగవచ్చునా
జ. త్రాగకూడదు.

18. ఉదయం టిఫిన్ తిన్నాక ఏమిచేయాలి
జ. పని.

19.మధ్యాహ్నం భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. విశ్రాంతి తీసుకోవాలి.

20.రాత్రి భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. 500 అడుగులు నడవాలి.

21. అన్ని వేళలా భోజనం చేసిన తర్వాత ఏమి చేయాలి
జ. వజ్రాసనం వేయాలి.

22. వజ్రాసనం ఎంత సేపు వేయాలి
జ. 5 - 10 ని.

23. ఉదయం లేచిన తర్వాత కళ్ళలో ఏమి వేయాలి
జ. లాలాజలం,( saliva ).

24. రాత్రి ఎన్నింటికి పడుకోవాలి
జ. 9 - 10 గం.

25. 3 విషముల పేర్లు
జ. పంచదార, మైదా, తెల్లటి ఉప్పు.

26. మధ్యాన్నం తినే కూరల్లో ఏమి వేసి తినాలి
జ. వాము.

27. రాత్రి పూట సలాడ్ తినవచ్చునా
జ. తినరాదు.

28. ఎల్లప్పుడూ భోజనం ఎలా చేయాలి
జ. క్రింద కూర్చుని మరియు బాగా నమిలి .

29. విదేశీ వస్తువులను కోనవచ్చునా
జ. ఎప్పుడూ కోనరాదు (Buy) .‌

30. టీ ఎప్పుడు త్రాగాలి
జ. అసలు ఎప్పుడు త్రాగకూడదు.

31. పాలలో ఏమి వేసుకుని త్రగాలి
జ. పసుపు.

32. పాలలో పసుపు వేసుకోని ఎందుకు త్రాగాలి
జ. క్యాసర్ రానివ్వకుండా ఉంటుంది.

33. ఏ చికిత్సా విధానం  మంచిది
జ. ఆయుర్వేదం.

34. వెండి, బంగారు పాత్రల్లో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో).

35. రాగి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. జూన్ నుంచి సెప్ట్ంబర్ ( వర్షాకాలంలో).

36. మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. మార్చ్ నుంచి జూన్ ( ఎండాకాలంలో).

37. ఉదయం పూట మంచినీరు ఎంత తీసుకోవాలి
జ. సుమారు 2,3 గ్లాసులు.

38. ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేవాలి
జ. సూర్యోదయాని 1.30 ముందుగా.

మిత్రులారా ఈ post నచ్చితే share చేయటం మర్చిపోకండి

ఈ-మెయిల్ పొరపాటు.!

ఈ-మెయిల్ పొరపాటు.!
.
ఒక వ్యక్తి కొత్తగా హోటల్ లోకి దిగాడు. రూమ్ లోకి రాగానే కంప్యూటర్ కనిపించింది.
భార్యకి ఈ-మెయిల్ పంపించాలనుకున్నాడు. కానీ తొందర్లో చూసుకోకుండా తప్పుడు ఈ-మెయిల్ అడ్రసుకి పంపించేశాడు.
కట్ చేస్తే ఎక్కడో మరో చోట భర్త కోల్పోయిన ఒక స్త్రీ స్మశానం నుంచి అప్పుడే తిరిగి వచ్చింది. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తనకు సంతాప సందేశాలు వచ్చి ఉంటాయేమోనని ఈ-మెయిల్ ఖాతా తెరిచింది. వాటిలో ఒక మెయిల్ చూడగానే కళ్ళు తిరిగి పడిపోయింది.
ఆ శబ్దం వినగానే ఆమె కొడుకు కంప్యూటర్ దగ్గరికి వచ్చి చూశాడు.
ఆ ఈ-మెయిల్ సారాంశం. ప్రియమైన భార్యామణీ! విషయం: నేను చేరుకున్నాను. నేను ఇంత తొందరగా మెయిల్ చేస్తున్నందుకు నీకు ఆశ్చర్యంగా ఉండచ్చు. మన ప్రియమైన వాళ్ళకు ఈ-మెయిళ్ళు పంపుకునేందుకు వీలుగా ఇప్పుడిక్కడ కంప్యూటర్లు కూడా పెట్టారోయ్!
ఇప్పుడే చేరుకుని లోపలికి చెక్-ఇన్ అయ్యాను.
రేపు నువ్విక్కడికి చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తాను. నీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటాను. నీ ప్రయాణం కూడా నా ప్రయాణం లానే సుఖంగా జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ…
నీ ముద్దుల రేడు
.

ఒక రోజు సర్దార్ ఉద్యోగం కోసం అని ఇంటర్వ్యూకి వెళ్లాడు. ఇతన్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక అమ్మాయి కూర్చుంది.

అమ్మాయి : ‘‘మీరు మందు తాగుతారా..?’’
సర్దార్ : ‘‘అవును’’.

అమ్మాయి : ‘‘ఎంత?’’
సర్దార్ : ‘‘రోజుకి ఆరు పెగ్గులు తాగుతా’’!

అమ్మాయి : ‘‘ఓహో.. ఆ ఆరు పెగ్గులకు ఎంత ఖర్చవుతుంది?’’
సర్దార్ : ‘‘సుమారు 1000 రూపాయల వరకు’’.

అమ్మాయి : ‘‘ఎప్పటినుంచి తాగుతున్నావ్?’’
సర్దార్ : ‘‘దాదాపు 14 సంవత్సరాల నుంచి’’

అమ్మాయి : ‘‘ఓహో.. అంటే రోజుకు 1000 రూపాయల లెక్కను నెలకు 30000 రూపాయలు తాగడానికి ఖర్చు పెడుతున్నావన్నమాట! అలాగే సంవత్సరానికి 360000 రూపాయలు! అంటే మొత్తం 14 సంవత్సరాలలో నువ్వు 50 లక్షల రూపాయల వేస్ట్ చేశావ్. నీకో విషయం తెలుసా.. అదే 50 లక్షలు వుండుంటే ఇప్పటికి నువ్వు BMW కొనుండేవాడివి’’

సర్దార్ : ‘‘నువ్వేమైనా మందు తాగుతావా?’’

అమ్మాయి : ‘‘లేదు. నేను ఇంతవరకు దానిని ముట్టుకోలేదు కూడా!’’

సర్దార్ : ‘‘మరి నీ BMW ఏది?’’  హాహాహాహాహా... హాహాహాహాహ.. అని నవ్వుకున్నాడు.

Sunday, April 17, 2016


తయారీ విధానం -
తాజాగా ఉండే నల్లద్రాక్ష పండ్లు తెచ్చి బాగా కడిగి నీరు వంచి శుభ్రమైన చేతులతో పిసకాలి. తరువాత శుభ్రమైన గుడ్డలో వడపోసి రసం తీసుకోవాలి . ఆ రసం 16 కిలొలు ఉండాలి. అందులో 3 కిలొల పటికబెల్లం చూర్ణం 3 కిలొల మంచి తేనే కలిపి శుభ్రమైన కొత్తకుండ లొ పోయాలి. అందులొ ఇంకా ఒక్కొటి 25 గ్రాముల చొప్పున నాగకేసర చూర్ణం , దొరగా వేయించిన పిప్పిళ్ళ చూర్ణం , శుద్ది చేసిన చిత్రమూలం చూర్ణం , వావిలి గింజల చూర్ణం , ఆకుపత్రి చూర్ణం , యాలుకల చూర్ణం , దాల్చినచెక్క చూర్ణం దోరగా వేయించిన మిరియాల చూర్ణం , లవంగాల చూర్ణం , జాజికాయల చూర్ణం పోసి కుండపైన మూకుడుతో మూసి వాసిన కట్టు కట్టాలి. పదార్దాలు కుండలో నిండుగా ఉండకూడదు . కుండలో నాలుగో వంతు ఖాళీగా ఉండాలి. కుండ మూతకు శీల మన్నుతో లేపనం చేయాలి .
తరువాత ఎండాకాలం లొ అయితే 3 వారాల పాటు , వర్ష, శీతాకాలలో అయితే ఒక నెలరొజుల పాటు ఆ కుండను ఒక మూలగా కదిలించకుండా భద్రపరచాలి. పైన తెలిపిన సమయానికి కుండలో పదార్దాల మద్య రసయనిక చర్య జరిగి ఆ పదార్దం అంతా అద్బుతమైన అమృత రసాయనం అవుతుంది. తరువాత మూత తీసి కుండలోని పదార్థాన్ని కదలకుండా పై పై తేట నీళ్లని వేరే పాత్రలోకి వంచుకోవాలి.ఈ రసాయనాన్ని గాజు సీసాల్లో నిలువ ఉంచుకొవాలి. పూటకు 25 గ్రాముల మోతాదుగా రోజు రెండుపూటలా సేవించాలి .
ఉపయొగాలు -
* ఉపిరితిత్తులు బలహీనత తగ్గిపొతుంది.
* సహజశక్తి కలుగుతుంది.
* రక్తం శుభ్రపడి కొత్తరక్తం పుడుతుంది.
* ఆస్తమా , క్షయ , ఉపిరితిత్తులు కాన్సర్ , అజీర్ణ రోగులుకు ఇది అమృతం కన్నా ఎక్కువుగా పనిచేస్తుంది .
* శరీరానికి ధృడమైన , శాశ్వతమైన బలం , యవ్వనం , రంగు లభిస్తాయి.
* శరీరకాంతి, బుద్ధిబలం, వీర్యవృద్ధి , కళ్లకు చలువ కలుగుతాయి.
పైన చెప్పిన మూలికలు, చూర్ణం లు ఆయుర్వేద దుకాణాలలో లభ్యం అవుతాయి.

Wednesday, April 13, 2016

How to control BP ఆహారనియమాలు

How to control BP

ఆహారనియమాలు

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

గుప్పెడంత గుండె మన ఛాతీలో రెండు ఊపిరితిత్తుల మధ్య పెరికార్డియం అనే పోరని కప్పుకొని నియమం గా , నిశ్చలం గా ఉండే ఓ శరీర అవయవము . ఈ గుండె తన క్రమాన్ని , నియమాన్ని తప్పి ఎక్కువగా కొట్టుకున్నా , తక్కువగా కొట్టుకున్నా అది మన జీవనాన్ని శాసించే వ్యాధి ... గుండె జబ్బు. గుండె జబ్బులలో ఒకటి ఈ రక్తపోటు .

గుండె , రక్త నాళా లలో ఉండే రక్తం వాటి గోడలపై చూపించే వత్తిడి ని రక్తపోటు లేదా బ్లడ్ ప్రజర్ అంటారు . ఇది ముఖ్యం గా రెండు స్థితుల పై ఆశారపడి ఉంటుంది . 1.గుండె కండరాలు పంపు చేసే శక్తి , 2. రక్తనాళాలు పంపు చేసిన రక్తాన్ని ఎంతవరకు తీసుకుంటాయో... ఆ శక్తి .

బ్లడ్ ప్రజర్ రెండు స్థితులలో గమనిస్తాము ... గుండె పూర్తిగా ముకులించుకునే (ముడుచుకునే) స్థితి ని " సిస్తొ లిక్ (Systolic)" అని , పూర్తీ గా విచ్చుకునే స్థితిని " డయస్టొలిక్(Diastolic)"అని అంటారు . ఈ రెండిటికీ మధ్య తేడాని " పల్స్ ప్రజర్(Pulse Pressure)" అని వ్యవహరిస్తారు .

ఉప్పు : బ్లడ్ ప్రెషర్ వచ్చాక నయము కావడమన్నది ఉండదు . కాని జీవనవిధానం లో మార్పులు ద్వారా రాకుండా జాగ్రత్తపడొచ్చు. జీవితములో చిన్న చిన్న మార్పుల ద్వారా నియంత్రణలో ఉందుకోవచ్చును.

ఆహారములో ఉప్పు వాడకము తగ్గించాలి. రోజుకు 5 గ్రాములకంటే మించి ఉప్పు వాడొద్దు . ముఖ్యము గా ప్రాసెస్డ్ , ప్యాకేజీపధార్ధములు , ఫాస్ట్ పుడ్స్ , క్యాన్డ్ పధార్ధములు తినడము బాగా తగ్గించాలి. ఎందుకంటే ఇందులో అదనపు ఉప్పు ఉంటుంది. సోడియం క్లోరైడ్ బి.పి.ని అధికము చేస్తుంది.

పొటాషియం : ఇది బి.పి.ని తగ్గిస్తుంది .బీన్స్ , జఠాణీలు, నట్స్ , పాలకూర , జ్యాబేజీ , కొత్తిమిర , అరటి , బొప్పాయి, ద్రాక్ష , కమలా , నారింజ , నిమ్మ వంటి పండ్లలలో పొటాషియం లభిస్తుంది. తక్కువ సోడియం , ఎక్కువ పొటాషియం గల పండ్లు రక్తపోటు తగ్గించడము లో బాగా ఉపయోగపడతాయి.కొబ్బరి నీరులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

కొవ్వు పదార్ధములు : వీటివలన రక్తము లో కొలెస్టిరాల్ పెరిగి బిపి ఎక్కువయ్యేందుకు దోహదపడుతుంది. నూనెలు ద్రవరూపములో ఉన్న కొవ్వులు. వీటి వాడాకము తగ్గించాలి. ఏ రకమైన పచ్చళ్ళు , ఆవకాయ , కారం ఊరగాయ వంటి వాటిలో నూనెలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ మోతాదులో వాడాలి. జంతు మాంసాలలో కొవ్వు ఎక్కువ ఉంటుంది.

ఆహారములో మార్పులు : ఎక్కువ పీచు పదార్ధము ఉన్న వాడాలి. పండ్లు , కాయకూరలు , ఆకు కూరలు , పప్పులు వాడాలి. రోజుకు కనీషము 5 సర్వింగులు పండ్లు , కూరకాయలు తింటుండాలి. సాష్ లు , ఊరగాయలు బాగా తగ్గించాలి.

ఆల్కహాలు : అలవాటు ఉండే వారు మానివేయాలి , . . లేదా పరిమితులు ఉండాలి.ఆల్కహాల్ ఎక్కువ కేలరీలు ఉన్న పానీయము .

పొగ త్రాగడము : దీనిలో నికొటిన్‌ ఉండడము వలన రక్తనాళాల పై ప్రబావము చూపుతుంది. పొగతాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఉప్పు , కారాలు ఎక్కువగా తినడం ,పొగ , ఆల్కహాల్ .. ఎక్కువగా తాగడం చేయవద్దు .

ఒకటి-రెండు

ఒకటి-రెండు

అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చివరన ఒక పెద్ద మర్రిచెట్టు. ఆ చెట్టు కింద ఒక చిన్న కొట్టం కట్టుకొని, అందులో ఒక ముసలమ్మ జీవించేది.
ముసలమ్మ మహా ధైర్యవంతురాలు. కొట్టానికి దగ్గరలోనే పెద్ద అడవి ఉండేది. అయినా కూడా ఆమెకు ఏమాత్రం భయం వేసేది కాదు. పైగా ఆ ముసలమ్మ ఒక్కతే రోజూ అడవికి పోయి, ఆయా కాలాలలో అడవిలో దొరికే రేగుపళ్లు, మేడిపండ్లు, బలిజ పండ్లు, నేరేడుపండ్లు వంటి రకరకాల పళ్లను బుట్ట నిండా ఏరి తెచ్చేది. వాటిని ఊళ్లో అమ్మి, వచ్చిన డబ్బుతో హాయిగా జీవించేది.
ఇలా ఉండగా, ఒకనాడు పండ్ల కోసం అడవికి వెళ్లిన ముసలమ్మ ఆ అడవిలో ఉండే రెండు పిల్ల దయ్యాల కంట పడింది. ముసలమ్మను చూడగానే పిల్లదయ్యాలకు కాళ్లూ చేతులు ఉలఉలా అన్నాయి. ముసలమ్మను ఆటపట్టించాలన్న ఆలోచన ఆ తుంటరి పిల్లదయ్యాలు రెండింటికీ ఒకేసారి కలిగింది. ఆ ఆలోచన రాగానే అవి రెండూ ముసలమ్మకు దగ్గరగా వెళ్ళి, ఏదైనా చేద్దామనుకున్నాయి; కానీ కొంచెం ఆలోచించినమీదట, తొందరపడకుండా కాస్త ఆగి ముసలమ్మను వెంబడించి ఏడిపించటమే మంచిదనుకున్నాయి.
ఇక ముసలమ్మేమో పళ్ళన్నిటినీ బుట్టనిండా ఏరి, ఆ బుట్టను నెత్తిన పెట్టుకొని నేరుగా ఇంటికి నడిచి వెళ్ళింది. దెయ్యాలు రెండింటికీ ముసలమ్మ కొట్టం ఉన్న మర్రిచెట్టును చూడగానే చాలా సంతోషం వేసింది. రెండూ మర్రి ఊడల్ని పట్టుకొని ఊగడం ప్రారంభించాయి. అంతలో ముసలమ్మ బయలుదేరి ఊళ్ళోకి వెళ్ళి, పళ్ళన్నీ అమ్మి, చీకటిపడే పొద్దుకు ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటికి ఆ పిల్ల దయ్యాలు రెండూ ఊగి ఊగి బాగా అలసిపోయి ఉన్నాయి. పైగా ఆకలి దంచుతూ ఉన్నది. ఇక అవి రెండూ అవ్వకు కనిపించాలనుకుని, ఒక్కసారిగా కనిపించి ఇకిలించాయి.
ఉన్నట్టుండి ఊడిపడ్డ రెండు దయ్యాలను చూసి ముసలమ్మ ఖంగుతిన్నది. కానీ లేని గాంభీర్యాన్ని నటిస్తూ- "ఎవరు మీరు? ఏం కావాలి మీకు?" అని ప్రశ్నలు వేసింది దర్జాగా.
"మేము దయ్యాలం. మాకు ఇప్పటికిప్పుడు చేసిన వేడివేడి రొట్టెలు కావాలి" అని దయ్యాలు రెండూ ఏకకంఠంగా అరిచాయి.
ముసలమ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా ఆలోచించుకునేందుకు సమయం దొరుకుతుందిలెమ్మని, ఆమె ప్రశాంతంగా రొట్టెలు చేయడానికి పూనుకున్నది. రొట్టెలు చేస్తూ చేస్తూ `దయ్యాలకు తిక్క కుదిరించడం ఎలా?' అని ఆలోచించేసుకుంది ముసలమ్మ.
ఆపైన పథకం ప్రకారం మూడు జొన్న రొట్టెలను చేసి, వాటిని ఒకే కంచంలో పెట్టి దెయ్యాల ముందు ఉంచింది. వాటిని చూసి దయ్యాలు రెండూ సంతోషంగా ఎగిరి గంతులు వేశాయి.
"కంచంలో ఉన్న రొట్టెలను పంచుకు తిందాం" అన్నది మొదటి దయ్యం.
`సరే'నన్నది రెండో దయ్యం.
మరి లెక్కపెడితే రొట్టెలేమో మూడున్నాయి! ఎలాగైనా తనే ఎక్కువ తినాలనుకున్నది లెక్కపెట్టిన మొదటి దయ్యం. దానికిగాను అది ఒక ఉపాయాన్ని ఆలోచించి, రెండో దెయ్యంతో ఒక చిన్న పందెం కాసింది:
"ఒరేయ్! మనం ఇద్దరం ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకుందాం. ఎవరైతే మొదట తమ కళ్ళను ఆర్పుతారో వారికి ఒకటే రొట్టె. గెలిచిన వాడికి రెండు రొట్టెలు" అన్నది.
"సరే" అన్నది రెండవ దెయ్యం.
ఇక అవి రెండూ ఒకదాని కళ్లల్లోకి ఒకటి చూస్తూ కూర్చున్నాయి. ఎంత సేపటికీ పందెం తెగలేదు. అవి దయ్యాలు కదా, కళ్ళ రెప్పలు ఆర్పలేవాయె!
ఇక అదే అదననుకున్న ముసలమ్మ పొయ్యిలో నాలుగు ఇనుప చువ్వలను పెట్టి ఎర్రగా కాల్చి, ఆ రెండింటినీ తీసుకొని, మెల్లగా వెళ్ళి, ఒక దయ్యానికి వెనక అంటించింది. ఆ వేడికి దయ్యానికి కళ్ళు కాదు కదా, ప్రాణమే పోయినంత పనైంది. అది ఎగ్గిరి దూకి, బోర్లా పడి, మొత్తుకోసాగింది.
తనే గెలిచానన్న సంతోషంలో ఉన్న రెండవ దెయ్యం అవ్వను, అవ్వ చేతిలోకి చేరుకున్న మరో రెండు చువ్వల్నీ గమనించలేదు. అది గంతులేసుకుంటూ "నాకు రెండు! నాకు రెండు! అని బిగ్గరగా అరిచింది.
'రెండేం ఖర్మ! నాలుగిస్తా'నని అవ్వ దానికీ రెండు అంటించింది. ఆ వాతల దెబ్బకు దెయ్యాలు రెండూ ఒక్కసారిగా అక్కడి నుండి అదృశ్యమయ్యాయి.
మూడు రొట్టెల్నీ మిగుల్చుకున్న అవ్వ వాటిని తిని, హాయిగా నిద్రపోయింది!
.

Tuesday, April 12, 2016

పసుపును ప్రసాదంగా ఇంటికి తీసుకొస్తే ఏం చేయాలి.....?

పసుపును ప్రసాదంగా ఇంటికి తీసుకొస్తే ఏం చేయాలి.....?
పసుపుని సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్య వస్తువులు ఎవరి నుంచి అయినా పొందవచ్చు. వాటికి మైల ఉండదు. అవేమిటంటే...
1. పసుపు, 2. కుంకుమ, 3. పూలు, 4. పళ్లు, 5. తమలపాకు, 6. వక్క, 7. పాలు, 8. పెరుగు, 9. నేయి, 10. తేనె, 11. కూరగాయలు, 12. తులసి, 13. గంధం అరగదీసే సానరాయి, 14. గంధం చెక్క
వీటిలో పసుపుకు మొదటి స్థానం కల్పించబడింది. అలానే సుమంగళులకు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారు.
పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగుళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు.
దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్లినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే మీరు ఏం చేస్తారు?
పసుపును ఇంటికి తీసుకు వచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు. అయితే ఇకపై అలా చేయవద్దు.
ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకు వచ్చినప్పుడు చేయాల్సిన విధాన క్రమం:
1. దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి.
2. పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయం అవుతాయి. పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు.
3. పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం నిశ్చయమవుతుంది.
4. దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి.
5. దుకాణాల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారమవుతుంది.
6. పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటికి ఆ ఇంటివారికి డబ్బుకు సమస్య రాదు, అప్పుల బాధ తొలగిపోతుంది.
7. కామెర్లు ఉన్నవారి ఇంటి వారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది.
8. ప్రతి సంవత్సరం కామెర్లు వచ్చేవారు సుమంగుళులకు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదు.
9. గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవ కళ పెరుగుతుంది.
10. వ్యాపారం జరుగని దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టెలో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది.
.