Sunday, February 26, 2017
Saturday, February 25, 2017
Friday, February 24, 2017
Thursday, February 23, 2017
Wednesday, February 22, 2017
Monday, February 20, 2017
Saturday, February 18, 2017
పంచముఖ ఆంజనేయస్వామి..................!!
పంచముఖ ఆంజనేయస్వామి..................!!
ఆంజనేయుడు అష్టసిద్ధులను కలిగియుండటం వల్లనే ఈయన మహాసిద్ధుడయ్యాడు..
ఎలాంటి క్షుద్ర ప్రయోగాలనైనా ఎదుర్కోవాలంటే ప్రత్యంగిరాదేవి ప్రముఖం.. కానీ ఆమెకంటే కూడా అధిక శక్తివంతమైన హనుమంతుడు కాశ్మోరా వంటి అతిభయంకరమైన క్షుద్ర ప్రయోగాలను నిమిషాలమీద నిర్మూలించగలడు.. ఆంజనేయస్వామి స్వరూపాలలో పంచముఖ ఆంజనేయస్వామి అత్యంత శక్తిమంతుడు.. మానవాతీత శక్తులను పొందాలనుకునేవారు క్షుద్రపీడలు నివారించగలిగే శక్తిని సాధించాలనుకునే వారు ఎక్కువగా పంచముఖ ఆంజనేయస్వామివారిని ఆరాధించాలి.. ఆయన ఐదు శిరస్సుల గురించి చెప్తున్నాను..
మధ్యభాగంలో వానరముఖం హనుమంతుడు..ఈ శిరస్సు ఆయన ధైర్యానికి, బలానికి చిహ్నం..
దక్షిణంవైపు చూసే శిరస్సు నారసింహుడు..ఈ శిరస్సు ఆయన నిర్భయుడని చెప్తుంది..
పశ్చిమ దిక్కువైపు చూసే శిరస్సు గరుత్మంతుడు.. ఈ శిరస్సు ఆయనయొక్క తంత్రజ్ఙానాన్ని తెలియజేస్తూ, పాము కాటు నుంచి కూడా రక్షిస్తుంది..
ఊత్తరదిక్కువైపు చూసే శిరస్సు వరాహస్వామి..ఈ శిరస్సు అనారోగ్యములను తొలగించి, పిశాచాలను వదిలించే శక్తినిస్తుంది..
ఆకాశంవైపు చూసే శిరస్సు హయగ్రీవస్వామి..ఈ శిరస్సు ఎంతటి బలవంతమైన శత్రువులనైనా జయించే శక్తినిస్తుంది.. ఇన్ని అద్భుతమైన శక్తులను కలిగియుండటం వల్లనే పంచముఖ ఆంజనేయస్వామి తంత్రమార్గంలో గొప్పస్థానాన్ని పొందాడు.. సూర్యనమస్కార విధానాన్ని, ప్రాణాయామాన్ని కనుగొన్నది కూడా ఆంజనేయుడే...
Friday, February 17, 2017
మన రాజ్యాంగం, చట్టాలు
మన రాజ్యాంగం, చట్టాలు
****************************
1) కొడుకు గాని కోడలు కాని మతం పుచ్చుకున్నాక పిల్లల్ని కంటే వారికి తాత ఆస్తిలోగాని,మరి ఎ ఇతర హిందూ బందువుల నుండిగాని,వారసత్వపు హక్కుగాని వాటా పంచమని అడిగే హక్కు గాని లేదు.
2)తల్లిదండ్రులు మతం మారినట్లైతే వారు పిల్లలకు ,పిల్లల ఆస్తికి గార్డియన్ గా (సంరక్షకులుగా) ఉండే హక్కు కోల్పోతారు.
(సెక్షన్ 6,హిందూ మైనార్టీ &గార్డియన్ షిప్ చట్టం)
అటువంటి అప్పుడు దగ్గర బందువులు గాని,చుట్టుపక్కల హిందువులుగాని స్వచ్చందంగా ముందుకు వొస్తే సంబంధిత జిల్లా కోర్టు వచ్చిన వారిని ఆ పిల్లలకు సంరక్షకులుగా కోర్టు నియమిస్తుంది. అంతేకాదు మత మార్పిడిల కార్యక్రమంపై (బాప్టిజం లేదా ముస్లిం మతంలపై) ముందుగా ఎవరైనా కోర్టుకు వొస్తే , మైనర్లను మతం మార్చకుండా సివిల్ కోర్టులకు తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే హక్కు ఉంది.
3) భార్యగాని భర్త గాని మతం మారితే లేక కూటములకు ,దర్గాలకు వెలుతుంటే వారి నుండి విడాకులు పొందవచ్చు. (సెక్షన్ 18(3) ii హిందూ వివాహ చట్టం)
4) భార్య గాని, తల్లీగాని, కుమార్తే గాని దర్గాలకు,కూటములకు వెల్తున్నారా??
ఐతే వారికి మీరు మనోవర్తి చెల్లించనవసరం లేదు.
(సెక్షన్ 18(3) ఆఫ్ ఆక్ట్ 78 ఆఫ్ 1956)
5) మతం మారిన వారు B.C -A,B,D గ్రూపుల
వారు O.C గా పరిగణించబడతారు.
అదే విధంగా క్రైస్తవ మతం పుచ్చుకున్న S.C లు B.C-C గాను ,ముస్లిం మతం పుచ్చుకున్న S.C లు O.C లుగా పరిగణింపబడుతారు.
6) మతం మార్చుకొని కూడా రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వారిపై సెక్షన్ 420 IPC ప్రకారం చీటింగ్ కేసులు పెట్టవచ్చు.
7) S.C కోటాలో ఉద్యోగం సంపాదించి తరువాత చర్చికి వెల్లడం లేదా క్రైస్తవం నమ్ముకోవడం చేస్తే వారి ప్రమొషన్ వారి పిల్లల సౌకర్యాల నిమిత్తం B.C-C. మాత్రమే అవుతారు. అలాంటి వారి పైన తాసిల్దార్కు కంప్లైంట్ చేయవచ్చు.
8) మతం మార్చుకున్న వారు S.అట్రాసిటి కేసు పెట్టే హక్కు ఉండదు. పాస్టర్లు B.C- C అవుతారు వారిపై S.C.,అట్రాసిటి చెల్లుతుంది.S.C కోటాలొ వొచ్చే ఉద్యోగాలు,పెన్శల్లు ,ఆస్తి హక్కులు ,లోన్ లు ,గవర్నమెంట్ రాయితీలు మొదలగునవి పోతాయి.
9) వేరు వేరు మతాల వారు చేసుకునే పెళ్ళి చెల్లదు - మద్రాస్ హైకోర్టు
మన దేశంలో రాజ్యాంగం లోని ఆర్టికల్ 25(1) ప్రకారం మత ప్రచారం హక్కు అంటే ఇతరులను మతం మార్చే హక్కు కాదు అని (AIR 1977 SC ) 908 కేసులు సుప్రీంకోర్టు తీర్చుచెప్పింది.అనేక సంధర్భాలలొ ఆశ చూపి,అబద్దం చెప్పి,భయపెట్టి ప్రలొభాలకు,వొత్తిడికి గురిచేసి మతం మార్చడం నేరమని అనేక న్యాయస్తానాలు తీర్పుచెప్పాయి...
మీరు తెలుసుకోండి అందరికి తెలియజేయండి జాగొ హిందు జాగో,
దయచేసి అందరికి షేర్ చేసి తెలుసుకునేలా చేయండి ..💡
✍ *రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!*
✍ *రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!*
*సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.*
*రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు*
*1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.*
*2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .*
*3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.*
*4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.*
*5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.*
*6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.*
*7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.*
*8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.*
*9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.*
*ఈ ఉపయోగకరమైన సమాచారం మీ మిత్రులకి షేర్ చేయండి.*
💐
అర్జునుడా..... కర్ణుడా.....
అర్జునుడా..... కర్ణుడా.....
🌻🔘🌻🌿🌻🔘🌻🔘
కర్ణుడి దానగుణాన్ని....
==============
అందరూ పొగుడుతూ ఉంటే.... అర్జునుడు భరించలేక
ఒక రోజు కృష్ణుడి దగ్గరకు వెళ్లి....
👉బావా! నేను కూడా దానాలు చేశాను.
👉అవసరమైతే కర్ణుడి కన్నా ఎక్కువ చేస్తాను.
👉అయినా నన్ను ఎవరూ గుర్తించటం లేదు.
👉అందరూ కర్ణుడి దాన గుణాన్నే పొగుడుతున్నారు.
👉దీని వెనకున్న కారణమేమిటి? అని అడిగాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.
===================
ఆ సంభాషణ జరిగిన సాయంత్రం...
అలా కృష్ణుడు, అర్జునుడు వాహ్యాళికి వెళ్లారు.
అక్కడ వాళ్లిద్దరికి ఒక బంగారు కొండ కనిపించింది. అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు.
అప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపు చూసి....
ఈ బంగారు కొండను దానం చేయి..... అప్పుడైనా
నీకు కర్ణుడి కన్నా మంచిపేరు వస్తుందేమో...అన్నాడు
====================
అర్జునుడు వెంటనే తన సేవకుల చేత....
చుట్టుపక్కల ఉన్న గ్రామాలవారికి బంగారం దానంగా తీసుకొమ్మని దండోరా వేయించాడు.
అన్ని గ్రామాల ప్రజలు రావటం మొదలుపెట్టారు. అర్జునుడు బంగారాన్ని తవ్వించి చిన్న చిన్న ముక్కలు దానం చేయటం మొదలుపెట్టాడు.
ఎంత మందికి దానం చేసినా బంగారం తరగటం లేదు. జనం సంఖ్య పెరుగుతూనే ఉంది....
ఒక రోజు అయ్యేసరికి అర్జునుడు అలసిపోయాడు....
====================
కృష్ణా....
👉దానం చేయాలంటే చిరాకుగా ఉంది... అన్నాడు... అప్పుడు కృష్ణుడు..నీకు దానం ఎలా చేయాలో చెబుతా.... అని కర్ణుడిని పిలిపించాడు.
ఈ బంగారం కొండలు మాకు కనిపించాయి. వాటిని నువ్వు ఎవరికైనా దానం చేస్తే బావుంటుంది..’’ అన్నాడు
======================
వెంటనే కర్ణుడు- అక్కడున్న ప్రజలందరి వైపు తిరిగి- ఈ కొండలు మీవి. వీటిని తవ్వి తీసుకువెళ్లండి..’’ అన్నాడు. అందరూ తమకు కావల్సిన బంగారం తీసుకెళ్లారు
=======================
అప్పుడు అర్జునుడితో కృష్ణుడు....
👉నీకు మనసులో బంగారంపై ఆశ ఉంది.
👉అందుకే చిన్న చిన్న ముక్కలు పంచిపెట్టావు.
👉కానీ కర్ణుడికి ఆశ లేదు.
👉అందుకే వారికి కొండ అంతా ఇచ్చేశాడు.
========================
🌻🌿🔘దానం చేసేవారి మనసులో....
ఎటువంటి ఆశ ఉండకూడదు....
అప్పుడే ఆ దానం ఫలిస్తుంది....... అని బోధ చేశాడు.
🌿🌻సర్వేజనా సుఖినోభవంతు🌻🌿
Thursday, February 16, 2017
మన *శ్రీహరికోట* గురించి కొంత తెలుసుకుందాం.....
మన *శ్రీహరికోట* గురించి కొంత తెలుసుకుందాం.....
దీనికి వేదికగా Sathish Dhawan Space Centre ను వేదికగా చేసుకుంది....SHAR గురించి మీకు తెలియని విషయలని మీతో పంచుకోబోతున్నాను....
* అసలు SDSC అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. SHAR అంటే శ్రీహరికోట అని అర్ధం.....
* శ్రీహరికోట, విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైలుమార్గం లో ఉన్న సూళ్లూరుపేట అనే రైల్వే స్టేషన్ నుంచి 21 కిలోమీటర్లు దూరం లో ఉంది.
*శ్రీహరికోట అనేది చెప్పాలంటే ఒక ద్వీపం.*
ఒక పక్క సముద్రం, ఒక పక్క పులికాట్ సరస్సు ఉంటుంది.
మనం ఎప్పుడూ వింటూ ఉండే Buckingham కెనాల్ కి ఒడ్డున ఉంటుంది.
* శ్రీహరికోట అనే ద్వీపం వైశాల్యం 44000 ఎకరాలు ఉంటుంది. అంటే మనం కట్టబోయే అమరావతి కన్నా కొంచెం పెద్దది. ఎక్కువ భూభాగం అడవులు ఉంటాయి. ఈ అడవులలో అడవి దున్నలు, పాములు, జింకలు వంటి వన్యప్రాణులు ఉంటాయి. ఎక్కువ ఆడవులు ఉండడం వల్ల వేసవి లో కూడా చల్ల గా ఉంటుంది.
* ఒకానొక సమయంలో రాకెట్ ను సైకిళ్ళ మీద ప్రయోగానికి తీసుకునివెళ్లే వారు. మొదటిగా సౌండింగ్ రాకెట్స్ ను ప్రయోగించేవారు.
* ఈ ప్రాంతం సముద్రం ఒడ్డున కోల గా ఉండడం వల్ల ఏమైనా అనుకోని పొరపాటు వల్ల రాకెట్ విఫలం అయితే సముద్రంలో పడిపోయేలా ఉంటుంది. సముద్రం లోకి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి ఉండదు.
* ఇక్కడ సముద్రం చాలా అందం గా ఉంటుంది. మన గోవా లో ఉన్నట్టు బాగా నీలం రంగు లో ఉంటుంది. అందులో పని చేసే వాళ్ళకి అప్పుడప్ప్పుడు వెళ్ళే అవకాశం ఉంది.
* సామాన్యులకు లోపలి కి వెళ్లే అనుమతి దొరకడం చాలా కష్టం. మన దేశ సరిహద్దు లో ఉండే CRPF, BSF జవానులు నిత్యం గస్తీ కాస్తూ ఉంటారు. మన దేశానికి గర్వకారణం అయిన రహస్యాలు వల్ల.....
* లోపలికి ఫోన్ కాదు కదా, చిన్న ఎలక్ట్రానిక్ వస్తువు కూడా తీసుకువెళ్ళనియరు. మూడు చోట్ల CRPF జవానులు సోదా చేశాకనే లోపలికి పంపిస్తారు.
* ఇక్కడ ప్రస్తుతానికి రెండు లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. వాటి చుట్టూ హై వోల్టాజ్ ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ నిత్యం ఉంటుంది. ఇంకొకటి నిర్మాణం లో ఉంది. అది పూర్తి అవడానికి మూడు సంవత్సరాలు పడుతుంది.
* ఒక లాంచ్ ప్యాడ్ నందు అసెంబ్లీ హాల్ (రాకెట్ ను తయారు చేసే చోటు ) కిలోమీటర్ దూరం లో ఉంటుంది. అసీంబ్లీ హాలు నుంచి రైల్వే ట్రాక్ వంటి వాటి మీద రెండు పెద్ద లారీలు రాకెట్ ను పాడ్ కు తరలిస్తారు.
* ఇంకో లాంచ్ పాడ్ నుంచి అసెంబ్లీ హాలు కిలోమీటర్ వెనక్కి వెళ్తుంది. అంటే అసెంబ్లీ హాలు కదిలేలా తయారు చేశారు.
* సాధారణం గా మనం లాంచ్ పాడ్ చూసి దానికింద ఏమి ఉండదు అనుకుంటాం. కానీ దాని కింద త్రిభుజం బోర్లించినట్టు ఆకారం లో 200 అడుగులు లోతు ఉంటుంది. కింద నీరు వచ్చేలా హై స్పీడ్ నాజిల్సు ఉంటాయి. 200000 లీటర్లు సరిపడా నీరు ఒకొక్క నాజిల్ నుంచి వస్తుంది. రాకెట్ వేడిని తట్టుకునేందుకు....
* ప్రయోగం జరుగుతున్నప్పుడు 7 కిలోమీటర్లు చుట్టు పక్కల ఏ ప్రాణి ఉండదు. ఉన్నా బ్రతకదు. లాంచ్ పాడ్ పక్కన రెండు భారీ లైటినింగ్ అరెస్ట్లు ఉంటాయి. అంటే పిడుగులు పడినా ప్యాడ్ కి ఏమి కాకుండా అవి తీసుకుంటాయ్.
* వాటికీ కెమెరాలు అమర్చబడి ఉంటాయి. సాధారణ కెమెరా తో ఆ చిత్రాలను బంధించడం కుదరదు. ISRO సౌజన్యం లేనిదే ఆ చిత్రాలు బయటకి రావు.
* శాస్త్రవేత్తలు కూర్చుని ఉండే స్థలాన్ని కంట్రోల్ సెంటర్ అంటారు. అక్కడ VVIP కి మాత్రమే అనుమతి. ప్రయోగం పూర్తి అయిన వెంటనే ఒక అగ్నిమాపక దళం వచ్చి పరిస్థితులు అన్ని సక్రమం గా ఉన్నాయి అని తేల్చిన తర్వాతే అక్కడకి మనుషులను అనుమతిస్తారు.
* లాంచ్ ఆయిన ప్రతి సారి ప్యాడ్లకు పెయింట్ వర్క్ చేస్తారు. అంత వేడి వల్ల పెయింట్ అంత కరిగిపోతుంది.
* స్పేస్ మ్యూజయం లో అన్ని మోడళ్లను ప్రదర్శన కు ఉంచుతారు. అక్కడికి మొబైల్ ఫోన్ లను అనుమతిస్తారు. చాలా అబ్బురపరిచే విషయాలు ఆ ప్రదర్శన శాల లో ఇన్నాయి.
* చెప్పాలంటే ISRO సాటిలైట్ ను మాత్రమే తయారు చేస్తుంది. ఇక్కడ ISRO కింద దాదాపు 800 కంపెనీలు పని చేస్తాయి. ఒకొక్క పార్ట్ ఒక దగ్గర తయారు అవుతుంది. ISRO వాటి అన్నింటికీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది....
* దాదాపు 150 అడుగుల వెడల్పు లో ఒక భారీ antenna ఉంటుంది. అంటే మన డిష్ టీవీ కి ఉండే డిష్ లాగా అన్నమాట. దాని నుంచే రాకెట్ ట్రాకింగ్ అవుతుంది. అది కొంత దూరం వరకే పని చేస్తుంది. ఆ పరిధి దాటితే అండమాన్ దీవుల్లో ఇంకో ట్రాకింగ్ సిస్టం ఉంది. అక్కడి నుంచి సంకేతాలు అందుతాయి. అది కూడా దాటితే Antarctica సముద్రం లో ISRO కి ట్రాకింగ్ స్టేషన్ ఉంది. అక్కడ నుంచి కూడా సమాచారం అందుతుంది.
* ట్రాకింగ్ స్టేషన్ ఎపుడూ చాలా చల్ల గా ఉంచడానికి నిత్యం AC లు రన్ అవుతూనే ఉంటాయి. SHAR లోపల ఒక చివర నుంచి ఇంకో చివరకి 40 కిలోమీటర్లు దూరం ఉండే రోడ్లు ఉంటాయి.
* అత్యంత భారీ దున్నపోతులు ఇక్కడ ఉంటాయి. ఒకసారి రాకెట్ ను తీసుకు వెళ్లే లారీ గోతి లో పడితే దున్నపోతులు పెట్టి లాగించారట...... సాయంత్రం 5 దాటితే ఇక్కడ ఎవరు ఉండరు ఒక్క ఎస్కార్ట్ పోలీస్లు తప్ప
ఇదండీ SHAR విశేషాలు. ఉపయోగం అనిపించేలా ఉంటె అందరికి Share చేయండి
✍ప్రశ్న---జవాబు👍
✍ప్రశ్న---జవాబు👍
ఇంట్లో, గుడిలో దేవుడి ముందు ఉంచే నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడా అనే ప్రశ్న .... ...
ఒక గురువు గారి దగ్గర కొంతమంది శిష్యులు చదువుకుంటుండేవారు, వారిలో ఒక పిల్లవాడికి ఇదే విధమయిన సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు. ఆరోజు పాఠం “ ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం . పాఠం చెప్పడం పూర్తయిన తరువాత, అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి తరువాత , నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు. నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు . దానికి ప్రతిగా శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు. శ్లోకం పుస్తకం లోనే ఉందిగా... నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ అన్నారు. పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది... నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్తితిలో ప్రవేశించింది. ఆదే స్థితి లో నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదీవి నేర్చుకోవడం వల్ల పుస్తకం లో స్థూల స్థితి లో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు. అదే విధం గా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితి లో గ్రహించి, స్థూలరూపం లో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు . దాన్నే మనం ప్రసాదం గా తీసుకుంటున్నాం. అని వివరణ చేశారు.
పరమేశ్వరీ ప్రసాద సిద్ధిరస్తు.